వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిడిపికి డ్వాక్రా మహిళలు పనిముట్లే: వైయస్
నెల్లూరు: డ్వాక్రా మహిళలను తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పనిముట్లుగా వాడుకుందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. వచ్చే ఐదేళ్లలో మహిళలకు 40 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన బుధవారం ఒక బహిరంగ సభలో అన్నారు. ఏడాదిలోనే ఆరున్నర లక్షల ఇళ్లు నిర్మించామని ఆయన చెప్పారు.
తమది రైతులు, రైతు కూలీలు, దళితుల రాజ్యమని ఆయన చెప్పుకున్నారు. వెనకబడిన ప్రాంతాలను, పెండింగ్ ప్రాజెక్టులను, వృధాగా పోతున్న నీటిని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. మహిళల కళ్లలో తాను వెలుగులు చూశానని, సోనియా కలలకు సార్ధకత చేకూరిందని, తన జన్మ సార్ధకమైందని ఆయన అన్నారు. సోమశిల ఉత్తర కాలువను పొడిగించి కొండాపురానికి నీరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Story first published: Wednesday, May 4, 2005, 23:53 [IST]