వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయశాంతినివిమర్శిస్తారా? బిజెపి కిషన్రెడ్డి
హైదరాబాద్:విజయశాంతిపై తెలుగుదేశంనాయకురాళ్ళ విమర్శలు అనుచితమనిబిజెపి శాసన సభా పక్ష నాయకుడు జి.కిషన్రెడ్డి అన్నారు. తానుతెలంగాణకు చెందిన వ్యక్తినని ఆమెచెబుతున్నారని, టిడిపి నాయకులువిలేకరుల సమావేశం పెట్టి ఆమెకుబర్త్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరంలేదని ఆయన ఎద్దేవా చేశారు. గతఎన్నికల్లో విజయశాంతితో తమ తమనియోజకవర్గాల్లో ప్రచారంచేయించుకోవాలని తెలుగుదేశం నాయకులుపోటీపడిన విషయం మర్చిపోలేమనికిషన్రెడ్డి అన్నారు. ఇంతలోనే ఆవిషయం మర్చిపోతే ఎలాగని ఆయనప్రశ్నించారు. కాగా తాను తెలంగాణకుచెందిన వ్యక్తిని కానని తెలుగుదేశంనాయకురాళ్ళు అనడాన్ని విజయశాంతిఖండించారు. తనది వరంగల్ జిల్లాఏటూరునాగారం మండలంరామన్నగూడెమని ఆమెపునరుద్ఘాటించారు.
Story first published: Saturday, May 7, 2005, 23:53 [IST]