20ఏళ్ళ తర్వాత కెనడాకు ఎయిరిండియాసర్వీసు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఎపియస్ ఆర్టీసి)ని ప్రైవేటీకరించబోమని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. నష్టాల్లో ఆర్టీసిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఆదివారంనాడు చర్యలను ప్రకటించింది. ఆర్టీసిని ప్రైవేటీకరించే యత్నాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు సమ్మె చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలను ప్రకటించింది.
వివిధ రాయితీలను ఆయా ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ శాఖలు ఆర్టీసికి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని వల్ల ఆర్టీసికి 270 కోట్ల రూపాయల రాబడి ఉంటుంది. అలాగే మోటార్ వాహనాల పన్ను వసూళ్లపై ఆర్టీసికి రాయతీ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఆర్టీసికి 180 కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. ఆర్టీసిని పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్మిక సంఘాలను, ప్రజలను కోరారు.