వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇందిర బాటలో అభివృద్ధిసాధిస్తాం: ముఖ్యమంత్రి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఇందిరమ్మ బాటలో రాష్ట్రాన్ని అన్ని విధాలాఅభివృద్ధి చేస్తామని ముఖమంత్రిరాజశేఖరరెడ్డి అన్నారు. రాష్ట్రంలోకాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకివచ్చి ఏడాది నిండిన సందర్భంగాహైదరాబాద్‌ ఎల్‌బి స్టేడియంలో జరిగినపునరంకిత సభలో ఆయనప్రధాన ఉపన్యాసం చేశారు. ఎన్నికలవాగ్దానాలను కొన్ని నెరెవేర్చామని,త్వరలో అన్ని వాగ్దానాలను పూర్తి చేస్తామనిఆయన అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులనిర్మాణానికి తమ ప్రభుత్వంప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందనితెలిపారు. రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన 26 నీటి పారుదల ప్రాజెక్టులుపూర్తయితే తమకు పుట్టగతులుఉండవని చంద్రబాబు నాయుడుభయపడుతున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో అందరికళ్ళల్లో ఆనందం చూడాలన్నది తమఆశయమని ముఖ్యమంత్రి అన్నారు. తమప్రభుత్వం అధికారంలోకి వచ్చినమరుక్షణం 1150 కోట్ల కరెంటుబాకాయిలను మాఫీ చేసి రైతులకు ఊరటకల్పించిందని, ఈ ఏడాది ఉచిత విద్యుత్‌ కోసంసుమారు నాలుగు వందల కోట్ల భారాన్నిభరించిందని ఆయన వివరించారు.రైతులు, మహిళలు, యువజనులఅభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంఇస్తున్నామని చెప్పారు. మహిళలకుపావలా వడ్డీకి రుణాలు ఇస్తున్నామనితెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X