వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ పరిసరాల్లోనే మొద్దు శ్రీను?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులోని ప్రధాన నిందితుడు జూలకంటి శ్రీనివాస్‌ రెడ్డి అలియాస్‌ శ్రీను హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరిటాల అనుచరుడు తగరకుంట ప్రభాకర్‌ హత్య కేసులోని నిందితుడు దామోదర్‌ రెడ్డి ప్రమాదానికి గురైన సంఘటన వెలుగులోకి రావడంతో మొద్దు శ్రీను ఆచూకీ కొంత దొరికినట్లయింది. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌ సమీపంలోని రాజేంద్రనగర్‌లో దామోదర్‌ రెడ్డితో పాటు ప్రమాదానికి గురైంది మొద్దు శ్రీనే కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

మూడు రోజుల క్రితం రాజేంద్రనగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. సాధారణ రోడ్డు ప్రమాదంగానే భావించి పోలీసులు గాయపడిన వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. అయితే గాయపడిన వ్యక్తి తగరకుంట ప్రభాకర్‌ హత్య కేసులోని నిందితుడు దామోదర్‌ రెడ్డి అనే విషయం తెలిసి అతడ్ని నిమ్స్‌కు తరలించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రమాదంలో గాయపడిన రెండో వ్యక్తి కనిపించడం లేదు. అతను మొద్దు శ్రీనే కావచ్చునని, ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దామోదర్‌ రెడ్డికి, మొద్దు శ్రీనుకు మధ్య విభేదాలున్నాయి.

ఇదిలా వుంటే, ప్రమాదంలో దామోదర్‌ రెడ్డి గాయపడినట్లు అతని తల్లికి ఎవరు చెప్పారనే విషయం పోలీసులకు అంతు చిక్కడం లేదు. తనకు ఫోన్‌ వచ్చిందని, ఫోన్‌ వచ్చిన వెంటనే తాను ఇక్కడికి వచ్చానని దామోదర్‌ రెడ్డి తల్లి లలితమ్మ అంటోంది. దామోదర్‌ రెడ్డిపై ఉన్న పాత కేసులను పోలీసులు తిరగదోడుతున్నారు. అతనిపై రెండు మూడు జిల్లాల్లో కేసులున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X