వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీనా, ప్రవీణ్‌లపై ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నిక నిష్పక్షపాతంగా జరగడానికి రాయలసీమ ఐజి మీనాను, అనంతపురం జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ (యస్పీ) ప్రవీణ్‌కుమార్‌ను అక్కడి నుంచి తప్పించాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ బృందం ఎన్నికల కమీషన్‌ను కోరింది. ఈ మేరకు టిడిపిపి నాయకుడు కె. ఎర్రంనాయుడు నేతృత్వంలో పార్లమెంటు సభ్యులు మంగళవారం ఎన్నికల ప్రధాన కమీషనర్‌ టాండన్‌కు వినతిపత్రం సమర్పించారు.

మంత్రులు జె.సి.దివాకర్‌ రెడ్డి, ఎన్‌. రఘువీరా రెడ్డి పెనుకొండలో పర్యటించకుండా ఆదేశాలు జారీ చేయాలని కూడా కోరినట్లు ఎర్రంనాయుడు విలేకరులతో చెప్పారు. తమ పార్టీ శాసనసభ్యుడు మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్‌ సూరిని, అతని అనుచరులను ఎన్నికలకు దూరంగా ఉంచాలని కోరినట్లు ఆయన తెలిపారు. పెనుకొండలో రాష్ట్రేతర పరిశీలకులను నియమించాలని కూడా విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. పెనుకొండ ఎన్నిక స్వేచ్ఛగా, సజావుగా జరగడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషన్‌ను కోరినట్లు ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X