వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై రెండో ఎస్సార్సీకే మా ఓటు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో తాము రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు తరలించిన సి ఆర్‌పియఫ్‌ బలగాలను తిరిగి రాష్ట్రానికి ఇవ్వాలని డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి కేంద్ర హోం మంత్రి శివరాజ్‌ పాటిల్‌ను కోరారు. నక్సలైట్లతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి సి ఆర్‌పియఫ్‌ బలగాల కోసం అడిగినట్లు సమాచారం. ఆయన మంగళవారం శివరాజ్‌ పాటిల్‌తో సమావేశమై నక్సలైట్‌ సమస్యపై, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించారు. నాలుగు హెలికాప్టర్లు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రిని కోరారు.

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను అన్నింటినీ త్వరలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో కూడా వై.యస్‌. మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులకు సహాయం అందించడానికి చిదంబరం సుముఖత వ్యక్తం చేసినట్లు రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. రోడ్లు, మున్సిపాలిటీల అభివృద్ధి తదితర విషయాలపై కేంద్ర మంత్రులతో చర్చించినట్లు ఆయన తెలిపారు.

పెనుకొండ ఘటనపై తెలుగుదేశం పార్టీ అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మొగున్ని కొట్టి మొగసాలకెక్కినట్లు తెలుగుదేశం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఆర్డీవో కార్యాలయంపై దండయాత్ర చేసింది తెలుగుదేశం వారేనని, కాంగ్రెస్‌ వారు చొరబడి రాళ్లేసింది కాంగ్రెస్‌వారని అంటోంది వారేనని, ఫిర్యాదులు చేస్తోంది వారేనని, ఈ పద్ధతి మంచిది కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X