వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ పాలనకు మురిసిన ప్రపంచ బ్యాంక్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఏడాది పాలనను ప్రపంచ బ్యాంక్ మెచ్చుకుంది. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో రాజశేఖర్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. సమావేశానంతరం ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ మైఖెల్ కార్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ద్రవ్యలోటును అదుపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కార్టర్ ప్రశంసించారు. ఆర్థిక మంత్రి కె. రోశయ్య ప్రతిపాదించిన బడ్జెట్ కూడా సంతృప్తినిచ్చిందని ఆయన చెప్పారు. అయితే సంస్థాగత సర్దుబాటు రుణం మంజూరు చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Tuesday, May 17, 2005, 23:53 [IST]