జిల్లా కాంగ్రెస్అధ్యక్షుల జాబితా విడుదల
కరీంనగర్:తెలంగాణ రాష్ట్రం పేరుతో టిఆర్ఎస్అధ్యక్షుడు చంద్రశేఖరరావుకల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలనువంచిస్తున్నారని తెలుగుదేశంఅధ్యక్షుడు చంద్రబాబు నాయుడువిమర్శించారు. అధికారం కోల్పోయినతర్వాత తొలిసారిగా తెలంగాణలోపర్యటించిన ఆయనకు జనం అనూహ్యంగా పెద్ద సంఖ్యలో ఆహ్వానంపలికారు. ప్రజల సమస్యలను తానుస్వయంగా తెలుసుకుని, వాటినిపరిష్కరించవలసిందిగా ప్రభుత్వంపైవత్తిడి తెస్తామని ఆయనగురువారం ఉదయం కరీంనగర్ జిల్లాపర్యటనలో తెలిపారు. గోదావరి నదిపైమహారాష్ట్ర నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల తెలంగాణకుఅన్యాయం జరుగుతుందని, వాటిని అడ్డుకుంటామనిఆయన ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాకామారెడ్డి అతిధి గృహం వద్ద కూడాచంద్రబాబు నాయుడికి జనం పెద్దఎత్తున స్వాగతం పలకడంతో ఆయనేఆశ్చర్యానికి గురయ్యారు. కరువుపనుల కోసం కేటాయించిన బియ్యాన్నికాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.