వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రికెట్: భారత జట్టు కొత్త కోచ్ చాపెల్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచ్గా ఆస్ట్రేలియాకు చెందిన గ్రెగ్ చాపెల్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసి ఐ) శుక్రవారం ఇక్కడ ప్రకటించింది. భారత జట్టు కోచ్గా చాపెల్ 2007 వరకు రెండేళ్ల పాటు కొనసాగుతారు.
ఆరుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీ చాపెల్ పేరును సిపార్సు చేసినట్లు, చాపెల్ 2007 జూన్ వరకు జాతీయ జట్టుగా కోచ్గా ఉంటారని బిసిసి ఐ అధ్యక్షుడు రణబీర్ సింగ్ మహేంద్ర మీడియా ప్రతినిధులతో చెప్పారు. జూన్ మొదటివారంలో చాపెల్ పదవీ బాధ్యతలు చేపడుతారని, ఇంకా తేదీ ఖరారు కాలేదని ఆయన చెప్పారు. న్యూజిలాండ్కు చెందిన జాన్ రైట్ పదవీ కాలం ముగియడంతో కోచ్ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో కొత్త కోచ్ ఎంపిక జరగాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన చాపెల్ 87 టెస్టు మ్యాచ్లు, 74 వన్డేలు ఆడాడు.
Comments
Story first published: Friday, May 20, 2005, 23:53 [IST]