వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెనుకొండలో పులివెందుల రాజకీయం: మైసురా
అనంతపురం: కాంగ్రెస్వారు అనంతపురం జిల్లా పెనుకొండలో ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల మార్కు రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి డాక్టర్ ఎం.వి. మైసురారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎన్ని ఎత్తులు వేసినా తమ పార్టీ అభ్యర్థి పరిటాల సునీత విజయం ఖాయమని ఆయన శుక్రవారంనాడు అన్నారు.
ఆది నుంచి ఫ్యాక్షనిస్టులకే టికెట్లు, పదవులు ఇస్తూ వచ్చిన రాజశేఖర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు. క్రిమినల్ కేసులున్న ఎంత మందికి రాజశేఖర్ రెడ్డి గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారో తెలియదా అని ఆయన అడిగారు. గత ఎన్నికల్లో పెనుకొండ కాంగ్రెస్ టికెట్ను గంగుల భానుమతికి ఇచ్చార కదా అని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, May 20, 2005, 23:53 [IST]