వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆందోళన బాటలో ఆర్టీసి కార్మికులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఎపియస్ ఆర్టీసి)కి అనుకూలంగా చర్యలు తీసుకోకపోతే సమ్మెకు దిగుతామని ఆర్టీసి ఐక్య కార్యాచరణ వేదిక నాయకులు సయ్యద్ మహ్మద్, రాజా రామమోహన్ రాయ్ చెప్పారు. ఆర్టీసి వస్తులను అమ్ముతూ ప్రభుత్వం సంస్థ ప్రైవేటీకరణకు పూనుకుంటోందని వారు శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు.
తమ డిమాండ్కు మద్దతు కూడగట్టడానికి ఈ నెల25వ తేదీన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అవుతున్నట్లు వారు తెలిపారు. 26వ తేదీన వివిధ సంఘాల నాయకులతో సమావేశమై వారి మద్దతు కోరుతామని వారు చెప్పారు. సంస్థపై వివిధ పన్నులు వేస్తూ రాయితీలు కల్పిస్తూ సంస్థను ప్రభుత్వం కావాలని నష్టాల ఊబిలోకి నెడుతోందని వారన్నారు. ముఖ్యమంత్రి గురువారం సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని వారు వ్యతిరేకించారు.
Comments
Story first published: Friday, May 20, 2005, 23:53 [IST]