వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహారాష్ట్రప్రాజెక్టులను అడ్డుకుంటాం:సిఎం
కరీంనగర్:గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వంనిర్మించబోతున్న బాబ్లి నీటిపారుదలప్రాజెక్టును అడ్డుకుంటామని ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి చెప్పారు. రైతు చైతన్యయాత్రలో భాగంగా విశాఖపట్నం నుంచిఇక్కడికి చేరుకున్న ఆయన రైతులసంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్నవివిధ కార్యక్రమాలను వివరించారు. ప్రతిమండల పరిధిలో డ్వాక్రా మహిళలకు రెండుకోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు తెలిపారు.తొమ్మిదేళ్ళ తెలుగుదేశం పాలనలోజరిగిన తప్పిదాల వల్లనే రైతులుఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయనఆరోపించారు. ఈ ఏడాది 12 లక్షల మందిరైతులకు రుణాలుఅందజేస్తామన్నారు. వచ్చే ఏడాది 120 కోట్లరూపాయల విలువైన ఆధునికవ్యవసాయ పనిముట్లనుఅందజేస్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, May 21, 2005, 23:53 [IST]