లెఫ్ట్ లేకుండామూడో ఫ్రంట్ అసాధ్యం: విపి సింగ్
కోచి:వామపక్షాలు,డి. ఎం. కె లేకుండా తృతీయ ఫ్రంట్ ఏర్పాటుసాధ్యం కాదని మాజీ ప్రధాని వి. పి. సింగ్ అన్నారు.ఇప్పటికిప్పుడు యూపీ ఏ ప్రభుత్వాన్ని అస్థిరపరిచితృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసే ఉద్దేశం వాటికిలేదని ధీమా వ్యక్తం చేశారు. "లెఫ్ట్, డి. ఎం. కె లేకుండా తృతీయ ఫ్రంట్నుఊహించలేం. భవిష్యత్తులో తృతీయ ఫ్రంట్ఏర్పడే అవకాశం ఉంది. అయితే యుపీ ఏ ప్రభుత్వాన్నిఅస్థిరపరచి ఏర్పాటు చేస్తాయనుకోనుఅన్నారు. ఎర్నాకులం ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసినకార్యక్రమంలో విలేఖరుల ప్రశ్నలకువి. పి. సింగ్ జవాబు చెప్పారు.
పూర్తి పదవీకాలాన్నిపూర్తి చేయటానికి యూపీ ఏకు అవకాశం ఇవ్వాలనివిజ్ఞప్తి చేశారు. బిజెపి మద్దతుతో ఫ్రంట్ఏర్పడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు.నేషనల్ ఫ్రంట్ కూటమి సభ్యుడిగా అప్పట్లోబిజెపికి మద్దతివ్వటం ఎంత తప్పిదమోగుజరాత్ అల్లర్ల తర్వాత తెలిసొచ్చిందనిఅన్నారు. " పెద్ద తప్పిదం చేశాననినా అంతరాత్మ ప్రబోధించింది అన్నారు.సమాచార హక్కు బిల్లును పాస్ చేసినందుకుయుపీ ఏ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు.బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని15 ఏళ్ళ క్రితమే ప్రయత్నించినా కొన్ని సమస్యలవలన సాధ్యం కాలేదని అన్నారు. ప్రజాస్వామికహక్కుల కోసం పోరాడటానికి ప్రజలకు గొప్పఆయుధం లభించిందని అవినీతి తగ్గుముఖంపడుతుందని అభిప్రాయపడ్డారు.