విమానంలోసూరివైజాగ్కు తరలింపు
హైదరాబాద్:పరిటాల రవి హత్యకేసులో ప్రధాన సూత్రధారిగాభావిస్తున్న మద్దలచెరువు సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరిని శనివారం మధ్యాహ్నం అత్యంత గోప్యంగాహైదరాబాద్ నుంచి ఇండియన్ఎయిర్లైన్స్ విమానంలో విశాఖపట్నంతరలించారు. పెనుగొండ ఉపఎన్నిక స్వేచ్ఛగా,సజావుగా జరగాలంటే సూరినిఅనంతపురం జైలు నుంచి మరో చోటికితరలించాలని, రాయలసీమ జోన్ ఐజి మీనానుమార్చాలని తెలుగుదేశం పార్టీ ఎన్నికలసంఘాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎన్నికల కమిషన్ రాష్ట్రప్రభుత్వాన్ని ఈ విషయమై ఆదేశించింది. ఎన్నికలకమిషన్ ఆదేశాల మేరకు జైళ్ళ శాఖడిజిపి సూరిని విశాఖపట్నంతరలించవలసిందిగా ఆదేశించారు. మారువేషాల్లోవచ్చేవారి నుంచి సూరికి ప్రాణాపాయం ఉందని ఇంటిలిజెన్స్ విభాగంహెచ్చరించడంతో సూరిని అత్యంతగోప్యంగా విశాఖపట్నం తరలించారు. ఎన్నికలకమిషన్ ఆదేశం మేరకుపెనుగొండ ఎన్నికల బాధ్యతలనుంచి ఐజిమీనాను తప్పించి, మరో ఐజి భూపతిబాబుకు బాధ్యతలు అప్పగించినవిషయంతెలిసిందే.