వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజీవ్ స్ఫూర్తితోనడుచుకుంటున్నాం:వైఎస్
విశాఖపట్నం:దేశానికి ఎన్నో సేవలు చేసి, ప్రాణ త్యాగం చేసిన రాజీవ్గాంధీ స్ఫూర్తితో ఎన్నోసంక్షేమ పథకాలను ప్రారంభించామనిముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చెప్పారు.విశాఖపట్నంలో రాజీవ్ వర్ధంతికార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నేడుదేశాన్ని అభివృద్ధి పథంలోనడిపిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపరిశ్రమకు బీజాలు వేసింది రాజీవ్గాంధేయేనని ఆయన కొనియాడారు.ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో ఐటిపరిశ్రమను అభివృద్ధి చేస్తున్నామనిఆయన చె ప్పారు. ఆర్టీసీ నష్టాలకు గతతెలుగుదేశం ప్రభుత్వమేకారణమని ఆయన ఆరోపించారు. ఆర్టీసీనిలాభాల్లో నడిపించేందుకు తమప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనిఆయన చెప్పారు. ఎన్నికలలో తాము ఇచ్చినహామీలను నెరవేర్చుకోవడం టిడిపికిఇష్టం లేదని ఆయన అన్నారు. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఆయనకు నివాళిఘటించారు.
Comments
Story first published: Saturday, May 21, 2005, 23:53 [IST]