వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బోర్డుకు, తెలంగాణ రాష్ట్ర సాధనకు లంకె లేదు: కెకె
న్యూఢిల్లీ: ప్రాంతీయ బోర్డు పునరుద్ధరణకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటకు సంబంధం లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేసి నిధులు కేటాయించి, సమగ్రంగా అభివృద్ధి చేస్తే వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందని ఆయన శుక్రవారం విలేకరులతో అన్నారు. ప్రాంతీయ బోర్డుల పునరుద్ధరణపై విస్తృతమైన చర్చ జరగాల్సి ఉందని ఆయన అన్నారు.
అభివృద్ధి కోసం ప్రాంతీయ బోర్డుల పునరుద్ధరణ తమ ప్రధాన డిమాండ్ తెలంగాణ ఏర్పాటుకు లక్ష్య సాధన దూరమవుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) అనుమానిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడినా ఏర్పడకపోయినా అభివృద్ధి అయితే కావాలి కదా అని ఆయన అన్నారు. అభివృద్ధికి ప్రాంతీయ బోర్డులను పునరుద్ధరించడం వల్ల జరిగే నష్టం ఏమీ లేదని ఆయన అన్నారు.
Story first published: Friday, May 27, 2005, 23:53 [IST]