వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్తో వోక్స్ వ్యాగన్ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్: జర్మనీకి చెందిన కార్ల తయారీ కంపెనీ వోక్స్ వ్యాగన్ ప్రతినిధులు బుధవారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో కార్ల తయారీ కర్మాగారాన్ని స్థాపించే విషయంపై వారు ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఈ కర్మాగారాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
వోక్స్ వ్యాగన్ కంపెనీ ప్రతినిధులు గత రెండు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారని, వారు రేపు కంపెనీ బోర్డుకు నివేదిక సమర్పిస్తారని, బోర్డు రాష్ట్రంలో కార్ల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి బొత్సా సత్యనారాయణ మీడియా ప్రతినిధులతో చెప్పారు. వోక్స్ వ్యాగన్ ప్రతినిధులు రాష్ట్రంలో మార్కెట్ను అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Friday, May 27, 2005, 23:53 [IST]