వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసి కార్మికులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఎపియస్ ఆర్టీసి) కార్మికులు శుక్రవారం సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారావుకు ఆర్టీసి ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మాట తప్పడంతో సమ్మె నోటీసు ఇవ్వక తప్పడం లేదని కమిటీ నాయకులు అన్నారు. సమ్మె నోటీసు ఇవ్వడం బాధాకరమే అయినా తప్పడం లేదని వారన్నారు. ఆర్టీసి కార్మికుల సమస్య పరిష్కారం కాగలదని కృష్ణారావు ఆశాభావం వ్యక్తం చేశారు.
సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. సమ్మెను విజయవంతం చేసి ఆర్టీసిని ప్రైవేటీకరించే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని వారు కోరారు.
Comments
Story first published: Friday, May 27, 2005, 23:53 [IST]