వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మావోయిస్టు సీనియర్ నేత రంగమ్మ లొంగుబాటు
కర్నూలు: సిపిఐ (మావోయిస్టు) ఒరిస్సా - ఆంధ్ర సరిహద్దు కమిటీ సీనియర్ నక్సలైట్ కర్నాటి రంగమ్మ అలియాస్ జ్యోతి శుక్రవారంనాడు కర్నూలు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ మల్లారెడ్డి ముందు లొంగిపోయింది. అనారోగ్యం కారణంగానే తాను లొంగిపోయినట్లు కర్నాటి రంగమ్మ తెలిపింది. కర్నూలు జిల్లా వడ్లమానుకు చెందిన రంగమ్మ 1991లో నక్సలైట్లలో చేరింది.
ప్రస్తుతం ఆమె ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు కమిటీ గాలికొండ దళం కమాండర్గా పని చేస్తోంది. పోలీసు స్టేషన్లపై దాడి, భవంతుల పేల్చివేత వంటి పలు సంఘటనల్లో ఆమె నిందితురాలని మల్లారెడ్డి విలేకరులకు చెప్పారు. రంగమ్మపై 50 వేల రూపాయల రివార్డు ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు.
Story first published: Friday, May 27, 2005, 23:53 [IST]