ఇది పగ,ప్రతీకారాల ప్రభుత్వం: చంద్రబాబు
హైదరాబాద్:వైఎస్ రాజశేఖరరెడ్డి ఏడాది పాలనలో స్ధానిక సంస్ధలు బలహీనపడ్డాయనితెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.మహానాడుతొలిరోజైన శనివారం ఆయన తనసుదీర్ఘ ప్రసంగంలో కాంగ్రెస్ప్రభుత్వం మీద దాడి చేశారు. ఎన్నికలముందు చేసిన వాగ్దానాలను కాంగ్రెస్ప్రభుత్వం మరిచిపోయిందని ఆయనఅన్నారు. గ్రామీణ నిరుపేదలకు ఏడాదికివంద రోజులు పని కల్పిస్తామన్న వైఎస్ ఆవాగ్దానం సంగతి మరిచిపోయారనిఆయన విమర్శించారు. శాంతి భద్రతలమీద చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపగ, ప్రతీకారాలు తీర్చుకోడానికివెనుకాడడం లేదని ఆయనఆరోపించారు. మహానాడుకు మామూలుగా వచ్చే ప్రతినిధుల సంఖ్యకునేడు మూడురెట్లు అధికంగా వచ్చారని ఆయనసంతోషం ప్రకటించినప్పుడు,ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల దృష్టికితేవాలని, వచ్చే నాలుగేళ్ళలో కష్టపడిపనిచేయాలని ఆయన కార్యకర్తలకు, నాయకులకు పిలుపుఇచ్చారు.