పెడ ధోరణికి నిర్మాతలే కారణం:మోహన్బాబు
హైదరాబాద్:తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్నఅనారోగ్య ధోరణులకు నిర్మాతలేకారణమని ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్టులసంఘం (మా) అధ్యక్షుడు మోహన్బాబు విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్కామర్స్ దర్శకుడు తేజపై నిషేధంవిధించడాన్ని ఆయన శనివారం మళ్ళీఖండించారు. నిర్మాతలు తమతాహతుకు మించి ఫైనాన్సియర్స్ వద్దఅప్పు తెచ్చుకుని, సంక్షోభంలో కూరుకుపోతున్నారని ఆయన అన్నారు.నేడు తేజ మీద నిషేధం విధించిన వారురేపు ఇంకెవరి మీదైనా విధిస్తారని, ఈ ధోరణినిఅడ్డుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. తమతో ఉద్దేశపూర్వకంగాదర్శకుడు తేజ ఎక్కువ ఖర్చుపెట్టించితమను మోసం చేశాడనిధైర్యం సినిమా నిర్మాతలు ఇచ్చినఫిర్యాదు మేరకు ఫిల్మ్ ఛాంబర్ఆయన మీద నిషేధం విధించింది.
కాగామోహన్బాబు ఫిల్మ్ఛాంబర్ చర్యను తీవ్రంగా ఖండించడానికి కారణంస్వార్ధప్రయోజనాలేనన్న విమర్శలు విన్పిస్తున్నాయి.మోహన్బాబు కుమారుడు విష్ణు ప్రస్తుతం తేజదర్శకత్వంలోవస్తాడు నా రాజు చిత్రంలో నటిస్తున్నాడు. ఫిల్మ్ఛాంబర్చర్యతో ఈ సినిమా నిర్మాణం నిలిచిపోయింది.