ఉచితవిద్యుత్ అనుచితం: ప్రధాని
ఝాక్రి: అదనపువిద్యుత్ ఉత్పాదనకు ఆటంకం కలిగించేఉచిత విద్యుత్ పథకానికి మద్దతివ్వడంమంచిది కాదని ప్రధాని మన్మోహన్ సింగ్అన్నారు. దేశంలో విద్యుత్కు డిమాండుపెరుగుతున్న కొద్దీ విద్యుత్ కోత తీవ్రస్థాయికి చేరుకోవటం పై ఆందోళనవ్యక్తం చేశారు. "కరెంటు ఉచితంగాఇవ్వటం వల్ల అదనపు విద్యుత్ ఉత్పాదనకుఆటంకం కలుగుతుంది. విద్యుత్ ఉత్పత్తిలోస్వావలంబన లోపిస్తుంది అని ఆయన అన్నారు.1500 మోగా వాట్ల నాత్పా ఝాక్రి హైడల్పవర్ ప్రాజెక్టును శనివారంనాడు జాతికిఅంకితం చేశారు. భారత్ నిర్మాణ్ యోజనపథకం కింద నాలుగు సంవత్సరాలలోఅన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయాలని,ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలనియుపిఎ లక్ష్యంగా చేసుకుందని అన్నారు.రాష్ట్ర విద్యుత్బోర్డులు తమసామర్ధ్యాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.లేని పక్షంలో విద్యుత్ ఉత్పత్తిలో మనంఅనుకున్న లక్ష్యాల్ని చేరుకోలేం అనిగుర్తుచేశారు.