పెనుకొండలో ఇప్పటికే గెలిచాం: మంత్రులు
అనంతపురం: ఫ్యాక్షన్కు దూరంగా ఉన్న నాయకుడికి టికెట్ ఇచ్చి పెనుకొండ ఉప ఎన్నికలో తాము ఇప్పటికే విజయం సాధించామని కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర మంత్రులు జె.సి. దివాకర్ రెడ్డి, రఘువీరా రెడ్డి అన్నారు. పెనుకొండలో వారు ఆదివారంనాడు భారీ ర్యాలీ నిర్వహించారు. శాంతిని కోరుకుంటున్న ప్రజలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విలన్గానూ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డిని హీరోగానూ చూస్తున్నారని వారన్నారు.
పెనుకొండలో గెలవడమే ప్రధానమని తాము భావించడం లేదని, అందుకే వెనకబడిన వర్గాలకు చెందిన బోయ శ్రీరాములుకు టికెట్ ఇచ్చామని వారన్నారు. ఓటమి భయంతోనే తమపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారని వారన్నారు. ఒక్క సీటు కోసం తెలుగుదేశం పార్టీ కక్కుర్తి పడుతోందని వారన్నారు. పెనుకొండ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని వారు చెప్పారు.