సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా ఇస్తాం: బాబు
హైదరాబాద్:సమైక్యాంధ్ర కోసం అవసరమైతేప్రాణాలైనా ఇస్తామని తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుఅన్నారు. సమైక్యాంధ్రతోనేసమగ్రాభివృద్ధి అనే తీర్మానాన్నితెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సభమహానాడులో ప్రతిపాదించారు. ఈసందర్భంగా చంద్రబాబుసమైక్యాంధ్రను సమర్థిస్తూమాట్లాడారు. ఆరు సూత్రాల పథకాన్ని అమలుచేయడానికి కృషి చేద్దామని ఆయనపిలుపునిచ్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలనుకాపాడుకుందామని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులపైతెలుగుదేశం నాయకులు కొందరువ్యక్తిగత విమర్శలు చేశారు.వ్యక్తిగత విమర్శలు వద్దని, పార్టీఅన్నాక ఒక నియమం ప్రకారంనడుద్దామని చంద్రబాబు సూచాంచారు.
సమైక్యాంధ్రతోనేసమగ్రాభివృద్ధి అనే తీర్మానాన్ని సీనియర్నాయకుడు సిహెచ్. రాజేశ్వరరావుసభలో ప్రతిపాదించారు. అధికారం కోసమేప్రత్యేక తెలంగాణ గురించిమాట్లాడుతున్నారని ఆయన కాంగ్రెస్,టి ఆర్యస్లపై విమర్శలు చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒకవేదికను ఏర్పాటు చేయాలని ఆయనసూచించారు. సమైక్యాంధ్ర కోసం జరిగేపోరాటంలో కలిసి రావాలని ఆయన సిపి ఐ,సిపియంలకు పిలుపునిచ్చారు. భాషాప్రయుక్త రాష్ట్రాలను విడదీసేందుకుప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందుకుఫజల్ అలీ కమీషన్ నివేదికను కూడావక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు.కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణితోవ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
తెలంగాణరాష్ట్ర సమితి నాయకులు కె.చంద్రశేఖర్ రావు, నరేంద్రలపైతెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలుచేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకోసం తమ జిల్లాకు చెందిన పొట్టిశ్రీరాములు త్యాగం చేశారని ఆయనచెప్పారు. నైజాం పాలన నుంచివిముక్తమై మనం ఒకటయ్యామని,విడిపోవడం సరి కాదని, తెలంగాణడిమాండ్లోని లాజిక్ ఏమిటని ఆయనఅన్నారు.