మందుపాతర: సిఐ సహా 9 మంది దుర్మరణం
హైదరాబాద్: మీడియాలో ప్రభుత్వ జోక్యం ఉండకూదని కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అన్నారు. మీడియా తనకు తానే ఒక లక్ష్మణరేఖ గీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూస్ మీడియాకు లక్ష్మణరేఖ ఉండాలా? అనే అంశంపై హైదరాబాద్లో ఏర్పాటయిన సదస్సును ఆయన బుధవారం ఉదయం ప్రారంభించారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిన ప్రతిసారీ ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు కీలకమైన పాత్ర పోషించాయని ఆయన అన్నారు.
మీడియాలో విలువలు తగ్గిపోతున్నాయని, ఇది పత్రికలకే కాకుండా తమలాంటివారికి కూడా బాధాకరమని ఆయన అన్నారు. విశ్వసనీయత మీడియాకు ప్రాణమని, అది కోల్పోతే శిక్షలాంటిదేనని ఆయన అన్నారు. మీడియా తనకు తానే పరిమితులు విధించుకోవాలని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జి.యన్. రే అన్నారు. ఈ సదస్సులో ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు, ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నయ్యర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ జర్నలిస్టు వి. హనుమంతరావు, ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవులపల్లి అమర్, తదితరులు పాల్గొన్నారు.