వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణకు మిలిటెంట్ పోరే దారి: ప్రకాశ్
మహబూబ్నగర్: అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభా నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. తమ శాసనసభ్యుడు పరిటాల రవిని హత్య చేసిననాడే పెనుకొండలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని ఆయన బుధవారం విలేకరులతో అన్నారు. పెనుకొండలో తమ అభ్యర్థి పరిటాల సునీత గెలుపు ఖాయమని ఆయన అన్నారు.
రాష్ట్ర మంత్రులు జె.సి. దివాకర్ రెడ్డి, రఘువీరా రెడ్డి పెనుకొండలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తమ అభ్యర్థి సునీత గెలిస్తే దివాకర్ రెడ్డి, రఘువీరా రెడ్డి మంత్రి పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అనైతిక విజయానికి మంత్రులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా వారు ఖాతరు చేయడం లేదని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, June 1, 2005, 23:53 [IST]