కంచి మఠంలో పాదాలు మోపిన స్వాములు
హైదరాబాద్: నగరాల్లో, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. మున్సిపల్ చైర్మన్ల, వైస్ చైర్మన్ల సమావేశంలో ఆయన సోమారంనాడు మున్సిపాలిటీల పనితీరును సమీక్షించారు. పట్టణాలను కాలనీలుగా అభివృద్ధి పరచడంపై కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించడంపై మున్సిపాలిటీలు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మున్సిపాలిటీల్లో రోడ్లు, రింగ్ రోడ్లపై శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. భూసేకరణ కోసం ప్రత్యేక కమిటీలు వేయనున్నట్లు ఆయన తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హామీలు గుప్పిస్తున్నారని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ ఉప నాయకుడు టి. దేవేందర్ గౌడ్ విమర్శించారు. పల్లెలను విస్మరించి ముఖ్యమంత్రి పట్టణాల చుట్టూ తిరుగుతున్నారని ఆయన అన్నారు. వైయస్ ఇంటి బాట పట్టక తప్పదని ఆయన అన్నారు.