రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం
హైదరాబాద్: గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం తెలంగాణ జిల్లాల్లో 24 గంటల నిరాహార దీక్షలు చేపట్టింది. వరంగల్లోని నిరాహారదీక్షలో మాజీ కేంద్ర మంత్రి, బిజెపి జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ, కరీంనగర్ దీక్షలో మరో మాజీ కేంద్ర మంత్రి సిహెచ్. విద్యాసాగర్ రావు, నల్లగొండ నిరాహార దీక్షలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. లక్ష్మణ్, నిజామాబాద్ దీక్షలో శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
మహారాష్ట్ర నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడానికి అవసరమైతే తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని విద్యాసాగర్ రావు కరీంనగర్లో మీడియా ప్రతినిధులతో చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చి మహారాష్ట్రపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రాజెక్టులపై హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే మహారాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నిరాటంకంగా కొనసాగుతోందని ఆయన అన్నారు. మహారాష్ట్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే తమ ఉద్యమాన్ని దశలవారీగా ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.