వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గ్రూప్-1 లీకేజీ సూత్రధారి చంద్రశేఖర్?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ( ఎపిపియస్సి) గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి చంద్రశేఖర్ అని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎపిపియస్సి సీనియర్ సభ్యుడైన చంద్రశేఖర్ లీకేజీకి పాల్పడ్డారని వారు చెబుతున్నారు. చంద్రశేఖర్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు మంగళవారంనాడు హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆందోళనకు దిగారు. ప్రదర్శన నిర్వహించి చంద్రశేఖర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. లీకేజీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అయిన చంద్రశేఖర్ను వదిలేసి పోలీసులు అభ్యర్థులను అదుపులోకి తీసుకుంటూ వేధిస్తున్నారని వారు విమర్శించారు. చంద్రశేఖర్ను అరెస్టు చేసేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు చెప్పారు. పరీక్షలను రద్దు చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.
Comments
Story first published: Tuesday, June 14, 2005, 23:53 [IST]