వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖమ్మం జిల్లాలో ఎన్కౌంటర్: నక్సల్స్ పరారీ
ఖమ్మం: ఖమ్మం జిల్లా వెంకటాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఈ ఎన్కౌ=ంటర్లో ఏ విధమైన ప్రాణనష్టం సంభవించలేదు. నక్సలైట్లు ఈ నెల 3వ తేదీన వెంకటాపురం ఎమ్మార్వో ఆఫీసును దగ్ధం చేశారు. అప్పటి నుంచి స్పెషల్ పార్టీ పోలీసులు నక్సలైట్ల కోసం గాలింపు జరుపుతున్నారు. మంగళవారంనాడు పోలీసులకు నక్సల్స్ తారసపడ్డారు. పోలీసులను చూసిన నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల నుంచి నక్సల్స్ తప్పించుకున్నారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు రివాల్వర్ను, స్టెన్గన్ను, తూటాలను, నిత్యావసర సరుకులను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Story first published: Tuesday, June 14, 2005, 23:53 [IST]