వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
14 ఐటి కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం
హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( ఐటి) రంగంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 14 కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహించడానికి విశాఖపట్నంలో స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచార, సాంకేతిక కార్యదర్శి రత్నప్రభ మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. దీని వల్ల 7 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె అన్నారు.
రాష్ట్రంలో ఐటి అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని, తన ప్రతిభ గల సాంకేతిక నిపుణులు ఉన్నారని ఆమె అన్నారు. 2009 నాటికి సాఫ్ట్వేర్ ఎగుమతులు 700 కోట్లకు చేరుకోగలవని ఆమె అన్నారు.
Comments
Story first published: Tuesday, June 14, 2005, 23:53 [IST]