రిజర్వేషన్లలో బిసిలకు అన్యాయం చేయం: వైయస్
హైదరాబాద్: వెనకబడిన కులాలకు (బిసిలకు) రిజర్వేషన్లకు అన్యాయం జరగుకుండా చూస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. బిసీలకు అన్యాయం జరగకుండా ముస్లింలను బిసిల్లో చేర్చి వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన వివరించారు. జస్టిస్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని బిసీ కమీషన్ మంగళవారం ముఖ్యమంత్రికి అందజేసింది.
ముస్లింలకు కల్పించే రిజర్వేషన్లు అదనమే తప్ప బిసిలకు అన్యాయం చేయబోమని ఆయన ముఖ్యమంత్రి చెప్పారు. కమీషన్ నివేదికను పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ముస్లింలను బిసి జాబితాలో చేర్చాలనేది తాము మొదటి నుంచీ భావిస్తున్నామని, దానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. ఆరు నెలల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించి వివిధ కోణాల్లో అధ్యయనం చేసి సుబ్రహ్మణ్యం కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.