వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ నక్సల్‌ను సజీవదహనం చేసిన ప్రజలు

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: చందాల కోసం వచ్చిన మాజీ నక్సలైట్లను చితకబాదిన సంఘటన వరంగల్‌ జిల్లా భూపాలపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది. రమేష్‌ అనే మాజీ నక్సలైట్‌ను ప్రజలు సజీవంగా దహనం చేశారు. ముగ్గురు మాజీ నక్సలైట్లు రాజయ్య అనే వ్యక్తి ఇంటికి వచ్చి బీరువాలోని ఐదు వేల రూపాయలు, దుకాణంలోని 1500 రూపాయలు తీసుకున్నారు. ఇది గమనించిన గ్రామస్థులు మాజీ నక్సలైట్లపై దాడి చేశారు. గ్రామస్థులను నుంచి తప్పించుకుని ఇద్దరు పారిపోయారు.

రమేష్‌ అనే మాజీ నక్సలైట్‌ను పట్టుకొని గ్రామస్థులు సజీవదహనం చేశారు. ఈ మాజీ నక్సలైట్ల ఆగడాలను సహించలేని గ్రామస్థులను ఆగ్రహంతో ఈ పనికి పూనుకున్నారు. మద్యం మత్తులో ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టించారు. రాజయ్య ఇంటిలోంచి, దుకాణంలోంచి డబ్బులు తీసుకున్న తర్వాత మద్యం దుకాణానికి వెళ్లి మళ్లీ చిత్తుగా తాగారు. ఆ తర్వాత ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తుండడంతో ప్రజలు వారిపై దాడికి దిగారు. మాజీ నక్సలైట్ల ఏ విధమైన మారణాయుధాలు లేవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X