వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిపియుయస్ ఐ రాష్ట్ర కార్యదర్శి సహా లొంగిన ఇద్దరు
వరంగల్: వరంగల్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ స్టీఫెన్ రవీంద్ర ముందు బుధవారంనాడు ఇద్దరు నక్సలైట్లు లొంగిపోయారు. లొంగిపోయినవారిలో ఒకరు సిపియుయస్ఐ నాయకుడు కాగా, మరొకరు మావోయిస్టు నక్సలైట్. వీరన్న నాయకత్వంలో ఏర్పడిన సిపియుయస్ఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి చార్వాకుడు ఎస్పి ముందు లొంగిపోయిన ఇద్దరు నక్సలైట్లలో ఉన్నాడు. కుల ప్రాధాన్యంపై జనశక్తితో విభేదించిన నక్సలైట్లు సిపియుయస్ఐని ఏర్పాటు చేశారు. వీరన్న కొద్ది కాలానికే ఎన్కౌంటర్ అయ్యాడు.
లొంగిపోయిన మరో నక్సలైట్ మావోయిస్టు ఖమ్మం జిల్లా వెంకటాపురం లోకల్ గెరిల్లా దళ సభ్యుడు ఆలం జగపతి. వెంకటపూరం సమీపంలో బుధవారంనాడు పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ప్రాణ నష్టం ఏదీ సంభవించలేదు. నక్సలైట్లు ఈ నెల 3వ తేదీన వెంకటాపురం ఎమ్మార్వో కార్యాలయాన్ని పేల్చివేశారు.
Comments
Story first published: Wednesday, June 15, 2005, 23:53 [IST]