అద్వానీ రాజీనామాకు విహెచ్పి ఆందోళన
హరిద్వార్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీ రాజీనామాకు ఉద్యమం చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) నిర్ణయించింది. హరిద్వార్లో జరుగుతున్న కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశంలో విహెచ్పి బుధవారం ఈ మేరకు తీర్మానం చేసింది. బిజెపి అధ్యక్షపదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవడం ద్వారా అద్వానీ సాధువులను అవమానించారని విహెచ్పి వ్యాఖ్యానించింది.
ఇదిలావుంటే, జిన్నాపై, బాబ్రీమసీదు కూల్చివేతపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని విహెచ్పి చేసిన డిమాండ్ను అద్వానీ తిరస్కరించారు. తాను చెప్పాల్సిందేదో ఇప్పటికే చెప్పానని, కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని ఆయన అన్నట్లు సమాచారం. కేంద్రీయ మార్గదర్శక్ మండలి సమావేశం సందర్భంగా పెషావర్ మఠం స్వామి విశ్వేష్ తీర్థ మంగళవారం అద్వానీతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అద్వానీ తన వైఖరిని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విశ్వేష్ తీర్థతో పాటు ఆఖార పరిషత్ ప్రధాన కార్యదర్శి స్వామి పరమానంద సరస్వతి అద్వానీకి అండగా నిలిచారు. అయినా అద్వానీకి వ్యతిరేకంగా విహెచ్పి కేంద్రీయ మార్గదర్శక మండలిలో తీర్మానం చేసింది.