వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ బోల్తా పడి నలుగురు మృతి చెందారు. 19 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు కొవ్వూరు, రాజమండ్రి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఐలూరు గ్రామానికి చెందిన పెళ్లి బృందం డిసియం వ్యాన్లో సూర్యాపేట్ వెళ్లుతోంది. వాడపల్లి సిమెంట్ లారీ ఎదురుగా రావడంతో దాన్ని తప్పించబోయి వ్యాన్ బోల్తా పడింది. రోడ్డు పక్క ముఖం కడుక్కున్న వీరరాఘవులు అనే వ్యక్తిని లారీ ఢీకొట్టింది. దీంతో అతను మరణించాడు. ప్రమాదంలో గాయపడిన ఒక బాలుడు రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Comments
Story first published: Thursday, June 16, 2005, 23:53 [IST]