వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి సీనియర్‌ నేత భండారీ కన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియన్‌ నేత సుందర్‌సింగ్‌ భండారీ బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఆయన నివాసంలో కన్ను మూశారు. ఆయన వయస్సు 84 ఏళ్లు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపక సభ్యుడైన భండారీ పార్టీలో కీలకమైన పదవులు నిర్వహించారు. సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన పని చేశారు.

బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వ హయాంలో ఆయన గుజరాత్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇటీవలి కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశాలయ్యాయి. బిజెపిలో వృద్ధనాయకులు యువ నాయకులకు అవకాశం కల్పించాలని, వాజ్‌పేయి, అద్వానీలు తప్పుకోవాలని ఆయన ప్రకటించి సంచలనం సృష్టించారు. గోద్రా సంఘటనకు ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని నిందించారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆయన గుజరాత్‌ గవర్నర్‌గా ఉన్నారు.

బిజెపి ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు, ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జోషి, ఇతర సీనియర్‌ నేతలు సుందర్‌లాల్‌ భండారీ నివాసానికి వెళ్లి ఆయనకు నివాళులర్పించారు. భండారీ మృతికి బిజెపి అధ్యక్షుడు అద్వానీ సంతాపం ప్రకటించారు. భండారీ మృతి పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X