వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు: ఇద్దరు మృతి
హైదరాబాద్: హైదరాబాద్లోని మీరాలం ట్యాంక్ సమీపంలో గల ప్రైమ్ ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడినవారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరణించినవారి శవాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. కంపెనీలోని పేలుడు శబ్దం చాలా దూరం వరకు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడుకు కారణాలేమిటో ఇంకా తెలియరాలేదు. సంఘటన విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
మృతులను బాలరాజు, హసన్లుగా గుర్తించారు. ఫ్యాక్టరీ యజమాని హతీక్ను పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ప్లాస్టిక్ బ్యాగ్లను ఈ ఫ్యాక్టరీలో రీసైక్లింగ్ చేస్తారు.
Comments
Story first published: Wednesday, June 22, 2005, 23:53 [IST]