వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ ఎస్టేట్ వద్ద కాల్పులు: ఆర్యస్ఐ మృతి
కడప: కడప జిల్లా వేంపల్లి మండలం మండలంలోని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఎస్టేట్ వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో చక్రాయపల్లి మండలం రెడ్డిచెరువు వద్ద నర్సింహులు అనే ఆర్యస్ఐ మృతి చెందినట్లు సమాచారం. ఎదురుకాల్పుల్లో ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడినట్లు తెలుస్తోంది. నక్సలైట్లు ఆయుధాలతో పారిపోయారు. గత మూడు రోజులుగా వైయస్ ఎస్టేట్ సమీపంలో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్టేట్ వద్ద మూడు నెలలుగా పోలీసులు మకాం వేశారు. ఇంకా వివరాలు అందాల్సి ఉంది.
Comments
Story first published: Wednesday, June 22, 2005, 23:53 [IST]