వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాహారంతో 200 మంది అస్వస్థత: విద్యార్థిని మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు మదర్సాలో విషాహారం తిని 200 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒక విద్యార్థిని మృత్యువు కబళించింది. అస్వస్థతకు గురైన విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిని మదనపల్లి ఆస్పత్రికి తరలించారు. 10 మందిని పుంగనూరు ఆస్పత్రిలో చేర్చారు. మిగతావారికి మదర్సాలోనే పది మంది వైద్యులు చికిత్స చేస్తున్నారు. మృతి చెందిన బాలిక కర్ణాటక రాష్ట్రానికి చెందింది. ఆహారం విషపూరితం కావడానికి కారణమేమిటో తెలియడం లేదు. ఈ మదర్సాకు మంచి పేరుంది. ఇప్పటి వరకు ఏ విధమైన అడ్డంకులు ఎదుర్కోని యాజమాన్యం ఈ సంఘటనతో తీవ్ర కలవరం చెందుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X