రఘువీరా నిబంధనల ఉల్లంఘనపై ఇసి నోటీసు
హైదరాబాద్: పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఒలింపిక్ డే రన్ సందర్భంగా ఆయన గురువారం లాల్బహాదూర్ స్టేడియంలో జరిగిన సభలో ప్రసంగించారు. హైదరాబాద్లోని ఏడు ప్రాంతాల్లో ప్రారంభమైన ఒలింపిక్ డే రన్లు లాల్ బహదూర్ స్టేడియానికి చేరుకున్నాయి. క్రీడాభివృద్ధికి తాము నిధులు సరిపడినంతగా కేటాయిస్తున్నామని, అవి సక్రమంగా వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
క్రీడలంటే క్రికెట్ అనే అభిప్రాయమే ఉందని, ఆ దృష్టి పోవాలని, మిగతా క్రీడలకు కూడా తగిన ప్రాధాన్యం ఉందని క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణరావు అన్నారు. గతంలో మన దేశం హాకీలో అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిందని, ఇప్పుడు ఏ క్రీడలోనూ తగిన ప్రతిభ కనబరచడం లేదని ఆయన అన్నారు. సానియా మీర్జా వింబుల్డన్ రెండో రౌండ్లో చాలా పోరాడిందని, ఇంకా ముందుకు దూసుకెళ్లాల్సిన అసవరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రాజగోపాల్ కూడా పాల్గొన్నారు.