వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ పోర్టు ట్రస్టుకు మహాత్మా పేరు: వైయస్
న్యూఢిల్లీ: విశాఖ పోర్టు ట్రస్టుకు మహాత్మా గాంధీ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కేంద్ర రవాణా, షిప్పింగ్ మంత్రి టి. ఆర్. బాలును కోరారు. ఆయన మంగళవారంనాడు బాలును కలిసి రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిపై చర్చించారు. రోడ్ల అభివృద్ధికి సహాయం అందించాలని ఆయన బాలుకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సమీపంలో షంషాబాద్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న విమానాశ్రయానికి రోడ్డును అభివృద్ధి చేయాలని కూడా ఆయన కోరారు. రాష్ట్రంలోని మచిలీపట్నం తదితర ఓడరేవుల అభివృద్ధికి కూడా సాయం అందించాలని ఆయన కోరారు.
Story first published: Tuesday, June 28, 2005, 23:53 [IST]