వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ను చట్టపరంగానే ఎదుర్కుంటాం: డిజిపి
రాజమండ్రి: నక్సలైట్లను చట్టపరంగానే ఎదుర్కుంటామని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ అన్నారు. నక్సలైట్ల కోసం నల్లమల అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చట్టం చేరుకోలేని ప్రదేశం ఉండదని నక్సల్స్కు తెలియజేయడానికే గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య ఈ ఏడాది జరిగిన అతి పెద్ద నేరసంఘటన అని ఆయన అన్నారు. రాజకీయపార్టీలు బస్సులను తగులబెట్టడం, ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదని ఆయన అన్నారు. నక్సల్స్ను ఎదుర్కోవడానికి కేంద్రం నుంచి స్పెషల్ పార్టీ బలగాలను అడిగినట్లు ఆయన చెప్పారు. పాస్టర్ల హత్యలు అత్యంత సంచలనం కలిగించిన సంఘటలని ఆయన అన్నారు. నల్లమలలో మళ్లీ కూంబింగ్లు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Tuesday, June 28, 2005, 23:53 [IST]