వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మూడు బస్సుల దగ్ధం: ఒకరి కాల్చివేత
హైదరాబాద్: రాష్ట్రంలో నక్సలైట్ల హింసాకాండ కొనసాగుతూనే ఉంది. మహబూబ్నగర్ జిల్లా ఆమ్రాబాద్ మండలం పహరాబాద్ చౌరస్తా వద్ద మావోయిస్టులు మూడు ఆర్టీసి బస్సులను తగులబెట్టారు. మహబూబ్నగర్ జిల్లాలోనే మావోయిస్టులు ఒకరిని కాల్చి చంపారు. వంగూరు మండలం తిమ్మాయపల్లిలో మావోయిస్టులు రాజు అనే కాంగ్రెస్ కార్యకర్తను మంగళవారం మధ్యాహ్నం కాల్చి చంపారు. ఇటీవల తమ ప్రకాశ్ ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు ఈ చర్యలకు పాల్పడినట్లు భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సిపిఐ (జనశక్తి) ఎల్లారెడ్డి పేట ఆర్గనైజర్ అంజయ్య పోలీసులకు లొంగిపోయాడు.
Comments
Story first published: Tuesday, June 28, 2005, 23:53 [IST]