వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అధికార ప్రతినిధిగా యశ్వంత్ సిన్హా తొలగింపు
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) వేటు వేసింది. యశ్వంత్ సిన్హాను పార్టీ అధికార ప్రతినిధిగా తొలగించినట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. జార్ఖండ్లోని బిజెపి ప్రభుత్వంపై చేసిన విమర్శల నేపథ్యంలో యశ్వంత్ సిన్హాపై ఈ వేటు పడింది. జార్ఖండ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు యశ్వంత్ సిన్హాను పార్టీ నాయకత్వం హెచ్చరించింది. అయితే తాను చేసిన వ్యాఖ్యలను యశ్వంత్ సిన్హా సమర్థించుకున్నారు. దీంతో ఆయనను పార్టీ అధికార ప్రతినిధి హోదా నుంచి బిజెపి తొలగించినట్లు సమాచారం.
యశ్వంత్ సిన్హా సమాజ్వాదీ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి బిజెపి అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీని కలిశారు. జిన్నాపై అద్వానీ చేసిన వ్యాఖ్యలను కూడా యశ్వంత్ సిన్హా ఇటీవల తప్పు పట్టారు.
Comments
Story first published: Tuesday, June 28, 2005, 23:53 [IST]