వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబ్రీ కూల్చివేత కేసులో అద్వానీకి ఎదురుదెబ్బ
అలహాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీకి అలహాబాద్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అద్వానీకి విముక్తి ప్రసాదిస్తూ తీర్పు ప్రకటించిన రాయ్బరేలీ కోర్టుకు అలహాబాద్ హైకోర్టు మొట్టికాయలు వేసింది. తదుపరి ఆదేశాల కోసం ఈ నెల 28వ తేదీన రాయ్బరేలీ కోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు అద్వానీని ఆదేశించింది.
తమపై విచారణను కొనసాగించాలని రాయ్బరేలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ బిజెపి నాయకులు మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్కతియార్, విహెచ్పి నేతలు అశోక్ సింఘాల్, ఆచార్య గిరిరాజ్ కిశోర్, విష్ణుహరి దాల్మియా, సాధ్వి రితంబర దాఖలు చేసుకున్న రివిజన్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది.
Comments
Story first published: Wednesday, July 6, 2005, 23:53 [IST]