వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రాణభయంతోనే రాజీనామాలు: సిపియం
విశాఖపట్నం: ప్రాణభయంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) రాష్ట్ర మంత్రులు రాజీనామాలు చేశారని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం టి ఆర్యస్ మంత్రులు రాజీనామా చేయలేదని, ప్రాణభయంతోనే చేశారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజా ప్రయోజనాలను పట్టించుకోకుండా టిఆర్యస్ మంత్రులు నాటకం ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సమ్మెలు జరుగుతున్నాయని, అనేక సమస్యలు ఉన్నాయని, వీటి నుంచి దృష్టి మళ్లించేందుకే టి ఆర్యస్ మంత్రులు రాజీనామా నాటకం ఆడుతున్నారని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, July 6, 2005, 23:53 [IST]