స్తంభించిన రైల్వే వ్యవస్థ: ఎక్ప్ప్రెస్ల దారి మళ్లింపు
హైదరాబాద్: సికింద్రాబాద్, విజయవాడల మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. రైల్వే వ్యవస్థ అస్తవ్యవస్తంగా మారింది. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ సమీపంలోని నష్కల్ వద్ద రైలు మార్గం దెబ్బ తినడంతో ఈ రైళ్లు రద్దయ్యాయి. ప్రయాణికుల కోరిక మేరకు రైల్వే అధికారులు చాలా రైళ్లను ఆపేశారు. పలు ఎక్ప్ప్రెస్ రైళ్లను నిజామాబాద్, గుంటూరుల మీదుగా దారి మళ్లించారు. దీంతో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు గంటల కొద్ది ఆలస్యంగా నడుస్తున్నాయి.
జోధ్పూర్, ఎపి ఎక్ప్ప్రెస్లను, సంపర్క్ సూపర్ ఫాస్ట్ ఎక్ప్ప్రెస్లను నిజామాబాద్ మీదుగా దారి మళ్లించారు. చార్మినార్, గౌతమి, దక్షిణ్, చెన్నై - వారణాసి ఎక్ప్ప్రెస్లను గుంటూరు మీదుగా దారి మళ్లించారు. కోణార్క్ ఎక్ప్ప్రెస్ను కూడా గుంటూరు మీదుగా మళ్లించారు. సమాచారం ఇచ్చేందుకు సికింద్రాబాద్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.
రైళ్ల రద్దుతో హైదరాబాద్లోని బస్సు స్టేషన్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. అవసరమైతే ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసి అధికారులంటున్నారు.