వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏడాదిలో తెలుగుగంగ నిర్మాణం: పొన్నాల
కాళహస్తి: తెలుగు గంగ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. భూసేకరణ వంటి పనులు పూర్తి చేస్తున్నామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలు నిరాధారమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పదేళ్లలో పూర్తి చేయాలని ప్రాజెక్టులను తాము రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆయన అన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టుపై ఆదివారం కాళహస్తిలో బహిరంగ చర్చల జరిగింది.
Comments
Story first published: Sunday, July 10, 2005, 23:53 [IST]